Wednesday, July 23, 2014

ప్రతిష్ఠాత్మక 'వాషింగ్టన్ ఒడంబడిక'లో భారత్‌కు పూర్తిస్థాయిలో శాశ్వత సభ్యత్వం

జూన్ - 13 , 2014
¤ ప్రతిష్ఠాత్మక 'వాషింగ్టన్ ఒడంబడిక'లో భారత్‌కు పూర్తిస్థాయిలో శాశ్వత సభ్యత్వం లభించింది. దీంతో భారతీయ డిగ్రీలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడంతోపాటు, అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగాలకు భారతీయ ఇంజినీర్లు మరింత సులువుగా వెళ్లేందుకు విస్తృతావకాశాలు ఏర్పడతాయి.   
»    2007 నుంచి భారత్‌కు ఈ ఒడంబడికలో తాత్కాలిక సభ్యత్వం ఉంది. తాజాగా అది శాశ్వతమైంది.   
»    1989లో కుదిరిన ఈ ఒప్పందంపై 17 దేశాలు సంతకాలు చేశాయి.   
»    ఇంజినీరింగ్ డిగ్రీ కార్యక్రమాలకు అధికారిక గుర్తింపును ఇచ్చే సంస్థల మధ్య కుదిరిన ఈ అంతర్జాతీయ స్థాయి ఒడంబడికను 'వాషింగ్టన్ అకార్డ్‌'గా పేర్కొంటున్నారు.   
»    తాజాగా న్యూజిలాండ్‌లో జరిగిన సమావేశంలో సభ్యదేశాలన్నీ భారత్‌కు శాశ్వత సభ్యత్వ మంజూరుకు అనుకూలంగా ఓటేశాయి.

No comments:

Post a Comment