Wednesday, July 30, 2014

ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది ఇద్దరు భారతీయ మహిళలు ఎవరు?

మార్చి - 4,2014


ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ఈ ఏడాది ఇద్దరు భారతీయ మహిళలకు చోటు దక్కింది. సావిత్రి జిందాల్, కుటుంబం 4.9 బిలియన్ డాలర్లతో, ఇందు జైన్ 2.3 బిలయన్ డాలర్లతో ఫోర్బ్స్ జాబితాకెక్కడం గమనార్హం.
   »    ఆసియాలోనే అత్యంత ధనవంతురాలిగా ఒకప్పుడు రికార్డు సృష్టించిన సావిత్రి జిందాల్ ప్రస్తుతం ఫోర్బ్స్ అంతర్జాతీయ జాబితాలో 295వ స్థానంలో నిలిచారు. బెన్నెట్ అండ్ కోల్‌మన్ అండ్ కో అధినేత్రి ఇందు జైన్ 764వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
¤
   క్రిస్టీ వాల్టన్ (జాన్ వాల్టన్ భార్య) 36.7 బిలియన్ డాలర్లతో మహిళల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థానాన్ని లారియల్ అధినేత్రి లిలియాన్ బెటెన్ కోర్ట్ (34.5 బిలియన్ డాలర్లతో), మూడో స్థానాన్ని మరో వాల్టన్ కుటుంబ సభ్యురాలైన అలైస్ వాల్టన్ (34.3 బిలియన్ డాలర్లు) దక్కించుకున్నారు.

No comments:

Post a Comment