Wednesday, July 23, 2014

కనీస మద్దతు ధరలు

 జూన్ - 25,2014
¤  వరి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. క్వింటాలుకు సాధారణ రకం ధాన్యం కనీస మద్దతు ధరను ప్రస్తుతమున్న రూ.1310 నుంచి రూ.1360 కి (పెరుగుదల రూ.50) పెంచగా, ఏ గ్రేడ్ రకం ధాన్యం ధరను క్వింటాలుకు రూ.1345 నుంచి రూ.1400 కి (పెరుగుదల రూ.55) పెంచింది. 2014-15 పంట ఏడాదికి వర్తించే ఈ కొత్త ధరలు అక్టోబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి.   
»     ఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ వ్యయధరల కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా ధరలను పెంచింది.  
 »     సీసీఈఏ నిర్ణయించిన ఇతర పంట ఉత్పత్తుల కనీస మద్దతు ధరలు (క్వింటాలకు) ఇలా ఉన్నాయి.   
»     మొదటి రకం పత్తిబేళ్లు రూ.4000 నుంచి రూ.4050  
 »     రెండో రకం పత్తిబేళ్లు రూ.3700 నుంచి రూ.3750   
»     కందిపప్పు, మినపపప్పు రూ.4300 నుంచి రూ.4350   
»     పెసరపప్పు రూ.4500 నుంచి రూ.4600   
»     సన్‌ఫ్లవర్ రూ.3700 నుంచి రూ.3750   
»     నువ్వులు రూ.4500 నుంచి రూ.4600   
»     హైబ్రిడ్ జొన్నలు రూ.1500 నుంచి రూ.1530   
»     రాగులు రూ.1500 నుంచి రూ.1550   
»     సజ్జలు (రూ.1250), మొక్కజొన్న (రూ.1310), వేరుశెనగ (రూ.4000), సోయాబీన్ (రూ.2500 - రూ.2560) ధరలను అలాగే కొనసాగించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది.

No comments:

Post a Comment