Thursday, July 31, 2014

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువు/ జీవులతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్‌

ఏప్రిల్ - 29,2014

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువు/ జీవులతో కూడిన ఇన్ఫో గ్రాఫిక్‌ను రూపొందించారు. వీటి ద్వారా ఏటా ఎంత మంది మానవులు చనిపోతున్నారనే వివరాలను కూడా తెలియజేశారు.   
»     దోమ ద్వారా వచ్చే మలేరియా తదితర వ్యాధుల వల్ల ప్రపంచంలో ఏటా 7.25 లక్షల మంది చనిపోతున్నారు. 20 కోట్ల మంది జ్వరాలు, జబ్బుల బారిన పడుతూ, మంచానికి అతుక్కుపోతున్నారు. అందుకే బిల్‌గేట్స్ ఈ జాబితాలో దోమను తొలిస్థానంలో చేర్చారు.    
»     దోమ తర్వాత ప్రమాదకర జీవి స్థానం మనిషిదే. ఒకరినొకరు చంపుకోవడం, యుద్ధాలు వంటి వాటివల్ల ఏటా 4.75 లక్షల మంది మరణిస్తున్నారు.  
 »     మూడో స్థానంలో పాము (50 వేల మంది మృతులు), నాలుగో స్థానంలో కుక్క (రేబిస్ వ్యాధి వల్ల 25 వేల మంది మరణిస్తున్నారు) ఉన్నాయి.   
»     తర్వాతి స్థానాల్లో ఒక రకమైన ఈగ, అసాసిస్ బగ్, నత్తలు ఉన్నాయి.ఇవి ఒక్కోరకం పది వేల మందిని బలితీసుకుంటున్నాయి.  
 »     ఈ జాబితాలోని చివరి మూడు స్థానాల్లో సింహం (100 మంది), తోడేలు (10 మంది), షార్క్ (10 మంది మృతులు) ఉన్నాయి.
 

No comments:

Post a Comment