Wednesday, July 30, 2014

అమెరికాలో చరిత్ర పూర్వయుగం నాటి జీవజాలాన్ని పునర్నిర్వచించేలా కీలక పరిశోధన చేసిన భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త

ఫిబ్రవరి -  20,2014


¤   భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త రీతూపర్ణ బోస్ అమెరికాలో చరిత్ర పూర్వయుగం నాటి జీవజాలాన్ని పునర్నిర్వచించేలా ఒక కీలక పరిశోధన నిర్వహించారు.
   »     ఓహియో, మిచిగన్ ప్రాంతాల్లో లభించిన శిలాజాలపై అధ్యయనం చేసిన ఆమె ఆ శిలాజాలు సుమారు 40 కోట్ల ఏళ్లనాటివని గుర్తించారు.
   »    ఈ శిలాజాలను గుర్తించేందుకు 'జియోమెట్రిక్ మార్ఫోమెట్రిక్స్' పేరుతో సరికొత్త పద్ధతిని ఆమె ఆవిష్కరించారు.
   »     సాధారణంగా డీఎన్ఏ సీక్వెన్సింగ్ ద్వారా శిలాజాలను గుర్తించడం కచ్చితత్వంతో కూడి ఉంటుంది. కానీ, చాలా శిలాజాల్లో డీఎన్ఏ సేకరించడం కష్టమవుతుంది. కాబట్టి, అలాంటి వాటికి తాను ఆవిష్కరించిన పద్ధతి ఉపయుక్తంగా ఉంటుందని ఆమె ప్రకటించారు.
   »     రీతూపర్ణ ఆవిష్కరించిన పద్ధతిని పలు అంతర్జాతీయ జర్నల్‌లు, యూనివర్సిటీలు ప్రశంసించాయి.

No comments:

Post a Comment