Wednesday, July 30, 2014

ప్రపంచ ఆహార పురస్కారం - 2014 (The World Food Prize - 2014)

జూన్ - 19,2014

భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ సంజయ్ రాజారాం అనే వృక్ష శాస్త్రవేత్త ప్రతిష్ఠాత్మక ప్రపంచ ఆహార పురస్కారం - 2014కు ఎంపికయ్యారు.   
»    రాజారాం గోధుమ రకాలను సంకరీకరణం చేసి విశిష్ట జన్యు లక్షణాలు గల, అధిక ఉత్పత్తినిచ్చే గోధుమలను సృష్టించారు. ఆయన అభివృద్ధి చేసిన దాదాపు 480 గోధుమ రకాలను 51 దేశాల్లో విడుదల చేశారు. రాజారాం పరిశోధనల ఫలితంగా హరిత విప్లవం అనంతరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల టన్నులకు పైగా గోధుమ ఉత్పత్తి పెరిగింది.
   »    
రాజారాం ఉత్తరప్రదేశ్‌లో జన్మించారు. రూ.కోటికి పైగా విలువ గల ఈ పురస్కారాన్ని రాజారాంకు అక్టోబరులో ప్రదానం చేయనున్నారు



No comments:

Post a Comment