Wednesday, July 30, 2014

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్ధీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ

జూన్ - 21,2014
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్ధీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది.   
»    ఈ నివేదిక ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులన్నింటినీ ఇక ఎఫ్‌డీఐగా పరిగణించనున్నారు. ఒక కంపెనీలో 10% కంటే తక్కువ ఉన్న పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా పరిగణిస్తారు కానీ, తొలి కొనుగోలు తర్వాత ఏడాదిలోగా వాటాను 10 శాతానికి పైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత కూడా వాటా 10 శాతానికి తక్కువే ఉంటే దాన్ని పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌గా పరిగణిస్తారు.   
»    అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఎంత ఉన్నా, దాన్ని ఎఫ్‌డీఐగా పరిగణించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. 

No comments:

Post a Comment