Thursday, July 24, 2014

ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారం 2014

జనవరి - 9,2014
¤   వివిధ రంగాల్లో చేసిన సేవలకు 13 మంది ప్రవాస భారతీయులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో 'ప్రవాసీ భారతీయ సమ్మాన్' పురస్కారాలను ప్రదానం చేశారు.
    »    దక్షిణాఫ్రికాలో 1994 నుంచి 2004 వరకు పార్లమెంట్ సభ్యురాలిగా పనిచేసిన మహాత్మాగాంధీ మునిమనవరాలు ఇలాగాంధీ దక్షిణాఫ్రికాలో చేసిన ప్రజాసేవకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
    »   భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆస్ట్రేలియాలో తొలి దక్షిణాసియా సెనెటర్‌గా, మంత్రిగా ఆమె ఘనత సాధించారు. ప్రజాసేవతోపాటు, భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహసంబంధాల వృద్ధికి కృషి చేసినందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు.
    »   1937 నుంచి ఫిజీలో సామాజిక సేవలందిస్తున్నందుకు ఫిజీలోని రామకృష్ణ మిషన్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఇతర గ్రహీతలు: వర్ఘీస్ కురియన్, వాసుదేవన్ చంచ్లానీ, వికాస్ చంద్ర సన్యాల్, సత్నారాయన్ సింగ్ రాబిన్ బల్దేవ్‌సింగ్, శశింద్రన్ ముత్తువేల్, శిబుద్దీన్ వావకుంజు, షంషేర్ వాయలీల్ పరంబత్, శైలేష్ లక్ష్మణ్ వర, పార్థసారధి చిరామెల్ పిళ్లై, రేణు ఖతోర్.
    »   న్యూఢిల్లీలో జరిగిన 12వ ప్రవాస భారతీయ దినోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు.

No comments:

Post a Comment