Friday, August 1, 2014

ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభించిన ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్మాణ సంస్థ

జూలై - 29,2014
ఈశాన్య సరిహద్దు రైల్వే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో మణిపూర్‌లో చేపట్టిన ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.       
»  నానీ సమీపంలో చేపడుతున్న ఈ వంతెన కోసం 141 మీటర్ల ఎత్తయిన స్తంభాలు నిర్మిస్తున్నారు.       
»  ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా పేర్కొంటున్న యూరప్‌లోని బెల్‌గ్రేడ్ - బార్ రైల్వే లైన్‌లో ఉన్న మాలా - రిజేకా వంతెన స్తంభాలు 139 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.       
»  111 కిలోమీటర్ల పొడవున జిరిబామ్ - తుపల్ - ఇంఫాల్ రైల్వే లైనులో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
       

»  జిరిబామ్ సముద్ర మట్టానికి 37 మీటర్ల ఎత్తులో ఉండగా ఇంఫాల్ 780 మీటర్ల ఎత్తులో ఉంది. పలు నదులు కూడా ప్రవహిస్తున్న ఈ మార్గంలో 46 సొరంగాలు, ఎత్తయిన వంతెనలు నిర్మిస్తున్నారు.
 

No comments:

Post a Comment