Saturday, August 2, 2014

101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ సమావేశం, దాని విశేషాలు

ఫిబ్రవరి - 3,2014

101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను జమ్మూలో ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రారంభించారు.   
»    ఈ సదస్సులో మన్మోహన్‌సింగ్ ప్రధాని హోదాలో పాల్గొని ప్రసంగించడం ఇది వరుసగా పదో ఏడాది.  
»    అయిదురోజుల పాటు జరిగే ఈ సదస్సులో 500 మంది దేశ, విదేశాల ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొంటారు.   
»    రూ.9 వేల కోట్లతో పలు శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రధాని మన్మోహన్‌సింగ్ సదస్సులో ప్రకటించారు.

ప్రధాని ప్రకటించిన ప్రాజెక్టులు
 రూ.4,500 కోట్లతో నేషనల్ మిషన్ ఆన్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్.
 తమిళనాడులో రూ.1,450 కోట్లతో న్యూట్రినో ఆధారిత అబ్జర్వేటరీ.
 ప్రఖ్యాత విదేశీ శాస్త్రవేత్తలను 12 నెలలపాటు భారత్‌లో పని చేసేందుకు రప్పించే లక్ష్యంతో 25 జవహర్‌లాల్ నెహ్రూ ఫెలోషిప్‌లు.
 రూ.3 వేల కోట్లతో జాతీయ భౌగోళిక సమాచార వ్యవస్థ ఏర్పాటు.
 యూరప్‌కు చెందిన ప్రతిష్ఠాత్మక అణు పరిశోధన సంస్థ సెర్న్‌లో భారత్‌కు సభ్యత్వం కోసం ప్రయత్నిస్తారు.

No comments:

Post a Comment