Monday, August 4, 2014

'భారత్‌లో ఉన్నత విద్య: విజన్ 2030' గురించి పూర్తి సమాచారం

నవంబరు - 13,2013


 'భారత్‌లో ఉన్నత విద్య: విజన్ 2030' అనే అంశంపై ఫిక్కీ రూపొందించిన నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ సహాయ మంత్రి శశిథరూర్ న్యూఢిల్లీలో విడుదల చేశారు.

ముఖ్యాంశాలు
      
»  ప్రతిభావంతులైన విద్యార్థులను అందించడంలో 2030 నాటికి ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంటుంది.
      

»  ప్రపంచంలో ప్రతి నలుగురు పట్టభద్రుల్లో ఒకరు భారత్‌లోని ఉన్నత విద్యావ్యవస్థ అందించిన వారే అయి ఉంటారు.
      

»  పరిశోధన ఫలితాల్లోనూ తొలి అయిదు దేశాల్లో భారత్ ఉంటుంది.
      

»  ప్రపంచంలోని 200 అగ్ర విశ్వవిద్యాలయాల్లో భారత విశ్వవిద్యాలయాలు 20 ఉంటాయి.
      

»  21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కొనేలా మానవ వనరులను సిద్ధం చేయడానికి వీలుగా ఉన్నతవిద్య, వృత్తి విద్యకు నిధులిచ్చేందుకు పారిశ్రామిక రంగం ముందుకు రావాలని శశిథరూర్ పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అనుగుణమైన విద్య, నైపుణ్య ఆధారిత కోర్సులను పరిచయం చేయాలని ఆయన సూచించారు.

No comments:

Post a Comment