Tuesday, September 30, 2014

పేదరికాన్ని నిర్మూలించేందుకు దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించిన కేంద్రం (Din Dayal Antyodaya Yojana scheme was launched to eradicate poverty in the teaching center)

Who:  కేంద్ర ప్రభుత్వం
What:  దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకం
When: 25 సెప్టెంబర్ 2014
Why:  పట్టాణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని పేదలను పైకి తేవడానికి

నైపుణ్యాలాను మెరుగుపర్చడం ద్వారా జీవనోపాధి అవకాశాలను పెంచి తద్వారా పట్టాణ మరియు గ్రామీణ ప్రాంతాలలోని పేదలను పైకి తేవడానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 25 సెప్టెంబర్ 2014న ప్ప్రారంభించింది. దీని కొరకు 500 కోట్లు కేటాయించింది. 

డీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో పట్టణ భారతదేశం మరియు గ్రామీణ భారతదేశం వంటి రెండు భాగాలుగా ఉన్నాయి. పట్టణ విభాగాన్ని హౌసింగ్ మరియు  పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వశాఖ ద్వారా అమలు చేయబడనుండగా గ్రామీణ విభాగాన్ని డీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన పేరుతో గ్రామీణాభీవృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అమలుచేయనుంది.

డీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌసల్య యోజన
ఈ యోజన క్రింద, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రామీణ భారతదేశంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు భారీ స్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణాకేంద్రాలు ప్రారంభించనుంది.

గ్రామీణ పథకం యొక్క ముఖ్యాంశాలు

• మూడేళ్లలో అంటే 2017 కల్లా 10 లక్షల (1 మిలియన్) గ్రామీణ యువతకు ఉద్యోగాల కోసం శిక్షణ ఇవ్వాలనేది ఈ యోజన లక్ష్యం.

• ఈ యోజనలో, ఆజీవిక నైపుణ్యాలు ప్రోగ్రాంలో ప్రవేశానికి ఉన్న18 సంవత్సరాల కనీస వయస్సును 15 సంవత్సరాలకు తగ్గించారు.
• గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలాగున నైపుణ్యాభివృద్ధి శిక్షణాకేంద్రాలు ప్రారంభంకానున్నాయి.
• ఈ యోజన ద్వారా సాధించిన నైపుణ్యాలు ప్రస్తుతం అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండనున్నాయి మరియు ప్రధాని యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రచారానికి పద బంధంగా ఉండనుంది.
• ఈ కౌసల్య యోజన, వివిధ వైకల్యాలు కలిగిన వారికి కూడా శిక్షణ ఇవ్వడంతోపాటు, గ్రామీణ యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రైవేట్ మరియు అంతర్జాతీయ శిక్షకులను పెట్టుకోనుంది.

పట్టణ ప్రాంతాల డీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన

పట్టణ ప్రాంతాల డీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజనలో ప్రభుత్వంచే గుర్తింపబడిన 4041పట్టణప్రాంతాలు మరియు అందులోని జనాభా ఉండనున్నారు. ఆయిత ప్రస్తుతం మాత్రం 790 పట్టణాలలో మాత్రమే అన్ని పట్టణ పేదరీక నిర్మూలనా కార్యక్రమాలు జరిగుతున్నాయి.

పట్టణ ప్రాంతాల పథకం లోని ముఖ్యాంశాలు

ఈ పథకం, వీటిపై దృష్టి సారించనుంది:
• ప్రతి పట్టణ పేదవ్యక్తికి నైపుణ్య శిక్షణ అందజేయటానికి 15000 నుండి 18000 రూపాయల వరకు వ్యయం చేయనున్నారు.
• 7 శాతం రాయితీ వడ్డీ రేటుతో రుణాలిచ్చి వ్యక్తిగత,సాముహిక మరియు సూక్ష్మ పరిశ్రమలు పెట్టుకునేలాగున పట్టణ ప్రజలను ప్రోత్సహించనుంది. వ్యక్తిగత వ్యాపారానికి రెండు లక్షలు మరియు సాముహిక వ్యాపారానికి 10 లక్షలు రాయితితో కూడిన రుణాలు ఇవ్వనున్నారు.
• స్వయం సహాయక సంఘాల ఆర్థిక మరియు సామాజిక అవసరాలను తీర్చుకునేందుకు ప్రతీ సంఘానికి 10000 రూపాయల చొప్పున బ్యాంకు లింకేజీ ద్వారా ఇవ్వనున్నారు.
• విక్రేతల నైపుణ్యన్ని అభివృద్ధి చేయడంతో పాటు విక్రేత మార్కెట్ల అభివృద్ధి చేయనుంది.
• పట్టణాలలోని ఇళ్లులేని ప్రజలకు శాశ్వత నివాసాల నిర్మాణం మరియు ఇతర అవసరమైన సేవలను అందించనున్నారు.

No comments:

Post a Comment