Tuesday, September 30, 2014

2015ఆస్కార్ అవార్డులకు భారత్ అధికారిక ఎంట్రీగా గీతూ మోహన్ దాస్ యొక్క లయర్స్ డైస్ చిత్రం

Liar's Dice2015 ఆస్కార్ అవార్డులకు భారత్ యొక్క అధికారిక ఎంట్రీగా గీతు మోహన్ దాస్ యొక్క హిందీ చిత్రం ‘లయర్స్ డైస్’ 23 సెప్టెంబర్ 2014న ఎంపికైంది. ఈ 87 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం 22 ఫిబ్రవరి 2015న అమెరికాలో ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రవిభాగంలో ఎంపికైంది.
మొత్తం 30 ఎంట్రీలు అందగా, ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాత టి హరిహరన్ నేతృత్వంలోని 12 మంది సభ్యుల జ్యూరీ ఏకగ్రీవంగా ఎంపికచేసింది.
‘లయర్స్ డైస్’
‘లయర్స్ డైస్’ చిత్రం 19 సెప్టెంబర్ 2014న తిరువనంతపురం లో విడుదలైంది. 26 సెప్టెంబర్ 2014న పూణేలొనూ, PVR పిక్చర్స్ ద్వారా నవంబర్ 2014లో దేశమంతా ప్రదర్శింబడనుంది. 
ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీతలు గీతాంజలి తాప మరియు నవజుద్దిన్ సిద్దికి నటించారు. ఈ సినిమా హిమాచల్ టిబెట్ సరిహద్దు వెంబడి వలసదారుల వ్యధలు వివరిస్తుంది.
ఈ చిత్రంలో, తప్పిపోయిన భర్తను వెతుకుంటూ వెళ్ళే కమల, తన కుమార్తె మరియు వారి ప్రయాణంలో తారసపడిన విచిత్రవ్యక్తి చేసిన సాహసాలను, భయంకరమైన సిద్దికి పాత్రకు కమల భయపడడాన్ని చిత్రీకరించారు.
2014 లో 61 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమాకు గాను రాజీవ్ రవికి ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు గీతాంజలికి ఉత్తమ నటి అవార్డ్లు లభించాయి.
అంతేకాకుండా, ఇది సన్ డాన్స్ ఫిలిం ఫెస్టివల్ మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రోటర్డ్యామ్ లో ప్రదర్శించబడింది.
ఈ సినిమా 2013 లో ముంబై ఫిలిం ఫెస్టివల్ (MFF)లో మొట్టమొదటిసారిగా ప్రదర్శించబడింది.
భారతదేశం మరియు ఆస్కార్ అవార్డులు 
భారతదేశం ఇప్పటివరకు ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో లో ఆస్కార్ గెలవలేదు. ఆస్కార్ అవార్డుకు చివరి ఐదు పోటీదారులలో పోటిపడిన అశుతోష్ గోవరికేర్ యొక్క ‘లగాన్’ చిత్రం మాత్రమే కనీసం అంతవరుకు చేరిన  ఆఖరి భారతీయ చిత్రం కాగా సలాం బాంబే మరియు మదర్ ఇండియా చిత్రాలు మాత్రమే ఇప్పటివరకు ఆస్కార్ ఐదు పోటీదారులలో స్థానం సంపాదించాయి.


No comments:

Post a Comment