Showing posts with label kendra Sahitya Akademi Award 2013. Show all posts
Showing posts with label kendra Sahitya Akademi Award 2013. Show all posts

Wednesday, July 30, 2014

కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం 2013 (kendraSahitya Akademi Award 2013)

డిసెంబరు - 18,2013


తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసిన కాత్యాయని విద్మహే కి ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది.      
»  తెలుగులో స్త్రీల కవిత్వ - కథ - అస్తిత్వ చైతన్యంపై కాత్యాయని రచించిన 'సాహిత్యాకాశంలో సగం' అనే వ్యాస సంకలనానికి ఈ పురస్కారం లభించింది.
      »  కాత్యాయని విద్మహే వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగం సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.      
»  మొత్తం 24 అధికార భాషలకు 22 భాషల నుంచి రచయితలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. అస్సామీస్, గుజరాతీ భాషలకు పురస్కారాన్ని ప్రకటించలేదు.      
»  ప్రముఖ బాలీవుడ్ గేయ రచయిత, స్క్రిప్ట్ రచయిత జావేద్ అక్తర్, ప్రముఖ హిందీ నవలా రచయిత్రి మృదులాగార్గ్, ప్రముఖ బెంగాలీ కవి సుబోధ్ సర్కార్ తదితరులు ఈ పురస్కారానికి ఎంపికైన వారిలో ఉన్నారు.      
»  జావేద్ అక్తర్ కలం నుంచి జాలువారిన 55 ఉర్దూ కవితల సంకలనం 'లావా'కు, మృదులాగార్గ్ రచించిన 'మిల్ జుల్ మన్' నవలకు ఈ పురస్కారం లభించింది.      
»  కవితల విభాగంలో ఎనిమిది పుస్తకాలను, నాలుగు వ్యాసాలను, మూడు నవలలను, రెండు కథలను, రెండు ట్రావెలాగ్‌లను, ఒక స్వీయ చరిత్రను, జ్ఞాపకాల విభాగంలో ఒక పుస్తకాన్ని, ఒక నాటకాన్ని ఈ పురస్కారానికి సాహిత్య అకాడమీ ఎంపిక చేసింది. నాటకం విభాగంలో ఒడిశాకు చెందిన బిజయ్ మిశ్రా ఎంపికయ్యారు. ఆయన రచించిన 'వన ప్రస్తా' అనే నాటకానికి ఈ పురస్కారం లభించింది.      
»  వరంగల్ జిల్లాకు చెందిన సాహిత్యవేత్తలకు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. ప్రముఖ నవలా కారుడు అంపశయ్య నవీన్ తెలంగాణ సంస్కృతి, ప్రజల జీవన విధానాలపై రాసిన 'కాలరేఖలు' నవలకు 2004లో తొలిసారి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.      »  2014 మార్చి 11న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార గ్రహీతలకు రూ.లక్ష నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను ప్రదానం చేయనున్నారు.
Javed Akhtar
mridula garg
subodh sarkar
bijay misra

Katyayni vidhmahe